Monday, September 21, 2009

డెట్రాయిట్లో శతజయంతి ఉత్సవాలు

కొడవగంటి కుటుంబరావు,శ్రీ శ్రీ,త్రిపురనేని గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు డెట్రాయిట్ లిటరరీ క్లబ్ ఆధ్వర్యంలో సెప్టెంబరు 26, 27 తేదీలలో ఫార్మింటన్ హిల్స్ లొని సెయింట్ తోమా చర్చ్ లో జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తమ కథ,నవల,కవిత్వం మొదలయిన అన్ని సాహిత్య ప్రక్రియలతోను 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా ప్రభావితం చేసిన ఈ ముగ్గురు రచయితల విశిష్టతను తెలిపే ఉపన్యాసాలు,చర్చలు,వినోద కార్యక్రమాలు,విందు భోజనాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొడవగంటి రోహిణీప్రసాద్,శ్రీరంగం వెంకటరమణ,త్రిపురనేని సాయిచంద్ రానున్నారు.

మరిన్ని వివరాలకు http://www.detroittelugu.org/DTLC/main.asp చూడండి.

No comments: